చిత్తూరు జిల్లా, సత్యవేడు తాలూకా, పిచ్చాటూరు మండలము, పుత్తూరు, చెన్నై రహదారిలో, అరుణానదీ తీరమున, రామగిరి గ్రామము నందు పర్వతమును ఆనుకొని వున్న క్షేత్రమే శ్రీ మరకతాంబికాసమేత శ్రీ వాలీశ్వర స్వామి దేవాలయము. ఈ పురాతన ప్రసిద్ధి పొందిన దేవాలయం తొమ్మిదవ శతాబ్ధమునకు చెందినది. ఈ దేవాలయము పల్లవకాలపు శిల్పకళా నైపుణ్య ములతో రూపు దిద్దుకున్నది. పర్వతము క్రింద ఉత్పత్తియగు నంది నోటి ద్వారా దేవాలయ కోనేటిలో నీరు నిరంతరం వస్తూ వుండడం వలన దీనిని నందితీర్ధమని అంటారు. నీరు త్రాగుటకు తీయగా, అమృత పానీయముగా ఉండును. ప్రకృతి సౌందర్యాలన్నీ రంగరించుకొని ఉండుట వలన ఈ ప్రదేశము ప్రశాంతంగా వుంటుంది. ఈ దేవాలయమును దర్శించిన భక్తులకు ఆత్మ సంతృప్తి, దైవానుగ్రహము పుష్కలంగా లభించునని భక్తుల ప్రగాఢ విశ్వాసము, నమ్మకము. ప్రస్తుతము ఈ దేవాలయము ఆంధ్రప్రదేశ్ దేవా దాయ, ధర్మాదాయ శాఖ వారిచే నిర్వహించబడుచున్నది. ఈ ఆలయమే వాలీశ్వర స్వామి దేవాలయము, రామగిరి.
పురాణకాలములో దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రులవారు, లంకాధిపతియైన రావణాసురుని సంహరించి, అతని ఆధీనములో బంధింప బడిన తన శ్రీమతి శ్రీ సీతాదేవిని విడిపించుకొని, తన పరివారముతో రామేశ్వరమునకు వచ్చెను శ్రీరామచంద్రులవారు.
రావణాసురుడు బ్రహ్మాంశ సంభూతుడగుటచే అతనిని సంహరించుటచే శ్రీరాముల వారికి బ్రహ్మహత్యాదోషము కలిగినది. ఈ దోషముతో అయోధ్య వెళ్ళి పట్టాభిషేకము చేసుకొనుట అంత మంచిది కాదని, వశిష్టాది మహర్షులు తెలిపారు. కాశీ పట్టణమందు గల ఒక స్వయంభు శివలింగమును తెచ్చి ప్రతిష్టించి, పూజించినచో, ఆ బ్రహ్మహత్యా దోషము తొలగునని తెలిపారు.
అందుకు శ్రీ రాములవారు సమ్మతించి, తన నమ్మినబంటుటైన శ్రీ హనుమంతుని పిలిచి ఆంజనేయా! ఈ రోజునే నీవు కాశీ పట్టణమునకు వెళ్ళి, రేపు తెల్లవారుజామున (సూర్యుడు ఉదయించక ముందే) గంగానదిలో స్నానంచేసి, కాశీ క్షేత్రమందున్న స్వయంభు శివలింగము నొకదానిని, మధ్యా హ్నములోగా తీసుకొని, రామేశ్వరమునకు రావలయునని ఆజ్ఞాపిం చెను.ఆంజనేయస్వామి శ్రీ రాముని ఆజ్ఞను శిరసావహించి ముందురోజే, రామేశ్వ రమును వదలి, ఆకాశమార్గములో తిరుక్కారిక అను గ్రామము మీదుగా కాశీకి వెళ్ళెను.
هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు