కొన్నాళ్ల క్రితం మేక్ ఇన్ ఇండియా కింద తయారైన తారిణీ నౌకలో ప్రయాణించి ఆరుగురు మహిళా అధికారులు ఒక సాహస కార్యంతో చరిత్ర సృష్టించారు. 2017 సెప్టెంబర్ 19న ఐశ్వర్య, ఎస్.విజయ, వార్తికా జోషీ, ప్రతిభా జామ్వాల్, సి.స్వాతి, పాయల్ గుప్తా ఐఎన్ఎస్ తారిణీలో ప్రయాణం మొదలుపెట్టారు.
2018 మే 19న 21,600 నాటికల్ మైల్స్ అనగా 216 వేల సముద్రపు మైళ్లు ప్రయాణించి తిరిగొచ్చారు. ఈ యాత్రకు దాదాపు 254 రోజులు పట్టింది. ఈ ఆరుగురు నేవీ మహిళా అధికారులు దీని ద్వారా చరిత్ర పుటలకెక్కారు.
2018 మే 21న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పోలాండ్, దక్షిణ ఆఫ్రికా గుండా గోవా చేరు కున్నారు. వారి ముందుకి కూడా పురుషులకు ఎదురైనట్లే అనే సవాళ్లు వచ్చాయి. కానీ వాళ్లు తీవ్రంగా ఎదురొడ్డి గెలిచారు. ఇది నేటి మహిళల మారుతున్న ఇమేజ్. ఆటంకాలను తిప్పి కొట్టి విజేతలవుతున్నారు.
భారత్ స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు అయ్యింది. స్వాతంత్ర్యానికి ఏడు దశకాలు గడిచాక మహిళల జీవితంలో అనేక మార్పు లొచ్చాయి. వారి పరిస్థితి మెరుగైంది. వారికి హక్కులు లభించాయి. బంధనాల నుంచి విముక్తి పొందగలిగారు. అనేక రకాల హక్కుల కోసం పోరాడి అనేక విజయాలు దక్కించుకున్నారు.
అనేక రంగాల్లో పురుషులకు పోటీగా నిలిచారు. కానీ మరో కోణంలో తరతరాల వేధిం పుల యాతన మాత్రం ఇంకా భరించాల్సి వస్తోంది. ఇప్పటికీ ద్వితీయ శ్రేణిగా, ఇంకా శారీరక వేధింపు లకు గురవ్వాల్సి వస్తోంది. ఈనాటికీ వారి పిడికిలి ఖాళీగానే ఉంది. రండి ఈ 75 ఏళ్లలో మహిళల జీవితాల్లో ఏ పాటి మార్పులొచ్చాయో చూద్దాం.
సానుకూల మార్పులు : సమాజం, కుటుంబంలో మహిళల స్థితిలో నిదానంగానైనా అనేక సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి.
విద్యావంతురాలైన నారీ
తన అస్తిత్వాన్ని గుర్తించి, సమర్థతను నిరూ పించుకోడానికి ఒక మహిళకు విద్య ముఖ్యమైనది. హక్కులు, కర్తవ్యాలను తెలుసుకోవాలి. ఎదగటానికి భయపడకూడదు. మహిళల ప్రగతిలో విద్య పాత్ర పెద్దదే. చదువుతోనే జాగృతి లభించింది. వారు పాతకాలపు పౌరాణిక ఆలోచనల నుంచి బయటికొస్తున్నారు. తమ హక్కులపై అవగాహన పొందుతున్నారు. చదువుకున్నాక ఉద్యోగానికై బయటికి వెళ్తున్నారు. పురుషాధిక్య సమాజంలో తమ స్థానాన్ని నిలుపుకొని ఆర్థికంగానూ స్వతంత్రులవుతున్నారు.
هذه القصة مأخوذة من طبعة August 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.