గ్రాంధీక భాష మార్గం మార్చి, వాడుక భాషకు ప్రాణం పోసిన మేరునగధీరుడు గిడుగు రామమూర్తి పంతులు. “కావ్య భాష వద్దు వ్యవహారిక భాష ముద్దు" అనే నినాదంతో ఉద్యమం చేపట్టి తెలుగు సాహిత్యంలో చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. 1911లో మొదలైన ఈ వ్యవహారిక భాషా ఉద్యమం సుమారు ఆరు దశాబ్దాల పాటు, ఆయన మరణించినా అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు తమ భుజాలపై మోసి చివరకు 1973లో తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. వ్యవహారిక భాషాగా తెలుగు అటు పరిపాలనలో ఇటు విద్యాపరంగా పరిపుష్టం అయ్యింది
(ఐ. ప్రసాదరావు 6305682733)
. ప్రపంచ వ్యాప్తంగా 6000 భాషలు ఉండగా, దాదాపు 3000 భాషలు మ్రృత స్థితిలో ఉండగా, 9.2 కోట్ల మంది మాట్లాడే మన తెలుగు భాష కూడ 2030 నాటికి చితికి శల్యం అయ్యే స్థితికి చేరుకుంటుంది అని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ప్రకటించుట తెలుగు ప్రజలకు, భాషాభిమానులకు గుండెల్లో గునపం దిగినట్టు అయ్యి, హృదయం కకావికలం అవుతుంది.. దీనికి ప్రధాన కారణం ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా అవతరించి, తెలుగు ప్రజలు ఆ వ్యామోహంలో చిక్కుకుని, ఆంగ్లాన్ని అనుసరించటకు సిద్ధ పడుటయే..
“నిలుచుటకు చోటు ఇస్తే - ఇల్లే నాది అన్నట్లు" నానుడిలా, ఉపాధి కోసం నేర్చుకున్న ఆంగ్లం ఇప్పుడు సర్వసం తానై మన జీవితాన్ని, స్థానికతను లాగేసుకుని, చివరికి మాతృభాషను కాలసర్పంలా మింగేస్తుంది.. ఏ జాతి ప్రజల ప్రగతికైనా మాతృ భాషే పునాది. అటువంటి కోవకు చెందినదే మన తెలుగు ప్రాచీన భాష. శాతవాహనుల కాలంలో జనించి, మధ్యయుగ కాలంలో ప్రవఢవిల్లి, “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్న కీర్తి గడించిన తెలుగు నేటికాలంలో అవసాన దశలో ఉండుట అత్యంత బాధాకరమైన విషయం. మన పొరుగు రాష్ట్రాలలో వారి మాతృ భాషలైన తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, ఇతర భాషలకు తరువాతి స్థానం కల్పిస్తూ ముందుకు సాగుతూ ఉండగా, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్లంలోనే అభివృద్ధి అనే భావనతో సాగుతున్నారు. సైకో లింగ్విస్టిక్స్" సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రులు మాట్లాడే భాషను బట్టే, వారి పిల్లలు భాషలో పరిపక్వత చెందుతారు అని తెలిపారు. అంతేకాకుండా 2020 జాతీయ విద్యా విధానం (యన్.ఇ.పి) కూడా ప్రాధమిక విద్య మాతృభాషలో ఉండాల్సిన అవసరం ఉంది అని తెలిపింది.
Diese Geschichte stammt aus der August 25, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 25, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
'35: చిన్న కథ కాదు'
ఈ మధ్య కొన్ని సినిమాలు స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాయి.
ఉరుకు పటేల
ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన 'ఉలవచారు బిర్యానీ'తో కథానాయకుడిగా పరిచయమైన యువకుడు తేజస్ కంచర్ల. 'హుషారు'తో విజయం అందుకున్నారు.
ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం
ముక్కు దిబ్బడకు జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు, అలర్జీలు వంటి అనేక కారణాలు వుంటాయి.
మొహం కడిగేటప్పుడు ఈ తప్పులు చేయకండి
సాధారణంగా ప్రతీ ఒక్కరు తన చర్మ సౌదర్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
గోధుమ పిండితో టేస్టీ బిస్కెట్లు..
ఇంట్లో తయారు చేసే బిస్కెట్లు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మైదాపిండితో తయారు చేసిన బిస్కెట్లు.. కానీ గోధుమ పిండితో కూడా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు.. చాలా హెల్దీ కూలగడా.. సాధారణంగా పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
క్షణికావేశాలు ఆత్మహత్యలు
ఈ ప్రపంచంలో అత్యున్నతమైనది మానవ జీవితం.జీవితంలో వచ్చు అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ జీవిత యాత్రను కొనసాగిస్తూ, తన జీవితాన్ని, కుటుంబాన్ని సురక్షితంగా, సంతృప్తికరంగా పూర్తి చేసే విధంగా మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలి.
సమయస్పూర్తి
బస్టాండ్ లో కూర్చుని ఉన్నారు శ్రీధర్, విశాల, బాబీ. తన చేతిలోని క్రికెట్ బాల్ కేసి సంతోషంగా చూస్తున్నాడు బాబీ. అది చూసి చిరాకుపడ్డాడు శ్రీధర్.
పుట్టింటి గౌరవం
లహరి చిన్న పిల్లేం కాదు. తనకు అంతా తెలుసు, తను ఏం చేస్తోందో? ఎందుకు చేయబోతోందో ? అన్ని ఆమెకు తెలుసు.
స్వాతంత్ర్యోద్యమంలో చవితి.. చారిత్రక ఉత్సవాలు
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి
తెలుగు వేటు పద్యాలు
తెలుగు వేటు పద్యాలు