అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి
తిరుమల-ఆంధ్రనాడు, అక్టోబర్ 06: గతమాసం సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి తెలిపారు. 53.84 లక్షల మంది అన్నదానం స్వీకరించారన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శు క్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ముందుగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు :
గతమాసం సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గరుడ సేవనాడు గ్యాలరీల బయట వేచి ఉన్న భక్తులను ఏడు ప్రత్యేక ప్రవేశమార్గాల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించి ఎక్కువమందికి సంతృప్తికర దర్శనం కల్పించాం. గరుడ సేవనాడు భక్తులందరికీ అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా అందించడం జరిగింది. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం ఈ నెల 14న అంకురార్పణ జరుగనుంది. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడసేవ, అక్టోబరు 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం నిర్వహిస్తాం. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది.గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. భక్తులందరికీ దర్శనం కల్పించేలా రాత్రి 12 గంటల వరకు ఉంటుంది.
ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు.
Diese Geschichte stammt aus der Oct 07, 2023-Ausgabe von Andhranadu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Oct 07, 2023-Ausgabe von Andhranadu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి
విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి అని తద్వారా శారీరక మానసిక దృఢత్వం తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
నరేష్ ఆచారి అంగప్రదక్షణ
సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలుపొందితే పొర్లు దండాలు పెడతానని ఆ దేవదేవుడికి కుప్పం టిడిపి పార్టీ అడ్వైజర్ నరేష్ ఆచారి మొక్కుకొని.. ఆ మొక్కను తీర్చుకున్నారు.
మిగిలిపోయిన వారికి 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ
గురువారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ ఛాంబర్ నందు అన్ని మండలాల ఎంపిడిఓ మునిసిపల్ కమిషన లు సచివాలయాల సిబ్బందితో వర్చువల్ విధానంలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి
సత్యవేడు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్ట్, అనస్థీషియా వైద్య నిపుణులు, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యుడు కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరారు.
ఏఐ సిటీగా అమరావతి
90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశం
సాకం నాగరాజకు వేమన సాహితీ పురస్కారం
గురువారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు
మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు
దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
తెలుగు వ్యవహార భాష ఆద్యులు గిడుగు వెంకట రామమూర్తి
తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల ఫించన్ లను ఈ నెల 31 (శనివారం) నే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేగవంతంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి
- స్మార్ట్ సిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్