తిరుమల-ఆంధ్రనాడు, అక్టోబర్ 10 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యప్రభ వాహనం-ఆయురారోగ్య ప్రాప్తి
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరగనుంది.
చంద్రప్రభ వాహనంపై వెలిగిన దర్బార్ కృష్ణుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం సాయంత్రం శ్రీ మల్లప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుని అలంకారంలో తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించాడు. “పురుషోత్తమ ప్రాప్తియాగం” చంద్రుడిని శ్రీ మహా విష్ణువు రూపుగా వర్ణిస్తుంది. ఖగోళ శాస్త్రం చంద్రుని సమస్త జీవకోటికి సస్యకారునిగా పేర్కొంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు తనను తాను వక్షత్ర కూటమిలో చంద్రునిగా అభివర్ణిస్తాడు. అందుకే అంకురార్పణం కూడా సాయంత్రం వేళ చంద్రకాంతిలోనే జరుగుతుంది. చంద్రప్రభ వాహనంపై స్వామివారి దర్శనం మంచికి, ప్రశాంతతకు, ఆనందానికి సంకేతంగా భక్తులు భావిస్తారు. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జియ్యంగారు, తిరుమల చిన్నజియ్యం, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీర బ్రహ్మం, సి వి ఎస్ ఓ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Esta historia es de la edición Oct 11, 2024 de Andhranadu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Oct 11, 2024 de Andhranadu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
కోహ్లికి 12వ ర్యాంక్
కోహ్లికి 12వ ర్యాంక్-ఐసిసి ఆల్టైమ్ టెస్ట్ ర్యాంకింగ్స్
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు
కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై తుమిసి రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు
లోకా ఫౌండేషన్లో అన్నదానం
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం అనిల్ పురం గిరిజన కాలనీ, మరియు బి జి ఆర్ కాలనీ వాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వరద ప్రభావిత ప్రాతాలలో ఎస్పీ పర్యటన
తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహిచే అవకాసం ఉన్న నేపధ్యంలో ముందస్తూ ప్రణాళికలో భాగంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వివి నగర్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పర్యటించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
చిన్నేరు, పెద్దేరు ప్రాజెక్టులను పరిశీలించిన అధికారులు
తుఫాను కారణంగా తంబళ్లపల్లి మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తహసీల్దార్ హరి కుమార్, ఇరిగేషన్ డీఈ సురేష్ కుమార్, ఏఈ సతీష్ కుమార్ లతో కలసి బుధవారం పెద్దేరు, చిన్నేరు, గోపిదిన్నె పెద్ద చెరువులను సందర్శించారు
భారీ వర్షం టిటిడి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
- భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు - 17 న శ్రీవారి మెట్టు నడక మార్గం మూత - టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలరావు
రెండు నెలల్లో టెండర్లు
- అమరావతిలో పనులపై సీఆర్డీఏ నిర్ణయం
సూపర్ హిట్ జోడీ
సీఎంగా సుదీర్ఘ అనుభవం గల ఆ నేత.. తన ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు
మసీదులో జైశ్రీరాం నినాదాలు మత విశ్వాసాలను దెబ్బతీయవు
మసీదులో జైశ్రీరాం నినాదాలు చేయడం వలన ఏ మత పరమైన విశ్వాసాలను దెబ్బతీయవని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది.
'ప్రజాదర్బార్ ' కు వినతుల వెల్లువ
ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ 42వ రోజు నిర్వహించిన \"ప్రజాదర్బార్\" కు వినతులు వెల్లువలా వచ్చాయి.