రాణీ రుద్రమదేవి మనుమడైన ప్రతాపరుద్రుడు మూడున్నర దశాబ్దాల పాటు ఓరుగల్లు (వరంగల్) రాజధానిగా చేసుకొని తెలుగువారి బావుటాను ఎగురవేశారు. ఢిల్లీ నవాబు తుగ్లక్ సేనల చేతిలో ఓటమిపాలై శత్రువులకు బందీగా చిక్కి అవమానభారం తట్టుకోలేక నర్మదా తీరంలో ఆత్మహత్య చేసుకొన్నారని శాసనాలు, చరిత్రకారుల వల్ల తెలుస్తోంది.
ప్రతాపరుద్రుని తరువాత కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయింది. ఆ తరువాత కొంత కాలం ఆంధ్రజాతి సరైన పాలకులు లేక యుద్ధాలతో అల్లకల్లోలంగా మారిపోయింది అని చరిత్ర చెబుతున్న విషయం. ఆ సమయంలో ముసునూరి నాయక, రాచర్ల నాయక వంశాలు నేటి తెలంగాణాలో మొగ్గ తొడిగాయి.కాకతీయ పాలకుల వద్ద సేనాపతులుగా ఎన్నో యుద్ధాలలో పాల్గొన్న రెడ్డి వంశంవారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చి నేటి ప్రకాశం జిల్లాలోని అద్దంకిని రాజధానిగా చేసుకొని రెడ్డి రాజుల సామ్రాజ్యానికి పునాది వేశారు.
మహామండలేశ్వరునిగా పిలవబడిన ప్రతాపరుద్రుని డెబ్భై ఏడు మంది నాయకులలో ప్రముఖులు ముసునూరి వంశ పాలనకు మూలమైన కాయప నాయకుడు, రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి.
ముసునూరివారు, రాచర్లవారు కొద్ది కాలమే పాలన చేయగలిగారు. రెడ్డి రాజులు మాత్రం సుమారు శతాబ్ద కాలానికి పైగానే తమ ప్రభావాన్ని ఆంధ్ర ప్రాంతాలలో కాకుండా తమిళ, ఓడ్ర దేశాల పైన కూడా చూపించారు అని శాసనాధారాలు తెలుపుతున్నాయి.
తొలుత అద్దంకి రాజధానిగా చేసుకొన్నా రాజకీయంగా అది సరైన ప్రాంతం కాదని తగిన అనువైన ప్రదేశం కోసం అన్వేషించి, చివరకు చుట్టూ పర్వతాలతో వున్న సురక్షితమైన కొండవీటి ప్రాంతాన్ని ఎంచుకొన్నారు. పటిష్టమైన కోటను నిర్మించుకున్నారు. వారి అంచనా తప్పలేదు. ఆనతి కాలంలోనే కొండవీడు శత్రుదుర్బేధ్యం అన్న పేరు పొందింది.రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి తప్ప మిగిలినవారు అంతా. కోట నుండే పాలన సాగించారు.తొమ్మిది మంది రెడ్డి రాజులలో ఎనిమిది మంది కొండవీడును తమ రాజధానిగా చేసుకొని కంచి నుంచి కటకం వరకు సువిశాల ప్రాంతాన్ని పరిపాలించారు.ప్రోలయ వేమారెడ్డి కుమారుడు అయిన అనవోతారెడ్డి కాలంలో కొండవీటి కోట నిర్మాణం పూర్తి అయ్యి రాజధాని అద్దంకి నుండి కొండవీడుకు మార్చబడింది.
Denne historien er fra September 15, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 15, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
కోటలకు కోట కొండవీటి కోట
ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.
చమత్కార శ్లోకాలు
మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.
సాధన చేస్తే గణితం సులభమే!
కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.
బాలగేయం
విజయం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
మట్టి విగ్రహం
రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.
సూర్యాస్తమయం లేని దేశాలు
ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాన్ని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు.
బ్రతుకు పుస్తకంలో అనుభవ భావాలు
ఆయుధం ఏం చేస్తుంది? ధరించిన వాడిని రక్షిస్తుంది. ఎదుటివాడిని శిక్షిస్తుంది. జీవనాధారానికి, స్వరక్షణకు వాక్కయినా, అస్త్రశస్త్రాలయినా ఆయుధాలే!
అలరిస్తున్న పద్యేంద్ర ధనస్సు
పుస్తక సమీక్ష
అద్భుతకళా 'రంగ్ మహల్'
పుస్తక సమీక్ష