భారత రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలను నిర్వచించకపోవడం వలన వెనుకబడిన వర్గాలు అనే పదానికి నిర్దిష్టమైన నిర్వచనం లభించడం లేదు. కనీసం రాజ్యాంగ రచయితలైనా లేదా సామాజికవేత్తలైనా వెనుకబాటుతనాన్ని నిర్వచించకపోవడం శోచనీయాంశం. 1956లో ప్రచురించిన వెనుకబడిన వర్గాల నివేదిక ఎస్సిలు, ఎస్టిలు, బిసి లను కలిపి వెనుకబడిన వర్గాలుగా పేర్కొన్నది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు నిర్వచించిన దాని ప్రకారం వెనుకబడిన వర్గం అంటే కులం, మతం, జాతి, భాష, వృత్తి తదితర ప్రాతిపదికలపై నిర్ధారించదగిన, గుర్తించదగిన వ్యక్తుల సమూహమై సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో వెనుకబాటు లక్షణాలతో ఉన్నదే వెనుకబడిన వర్గం. తక్కువ అక్షరాస్యత, విద్యలేమి, పేదరికం, శ్రామిక దోపిడీ, అంటరానితనం వంటి లక్షణాలతో కూడిన సాంఘిక సమూహాలు, వర్గాలు లేదా కులాలే వెనుకబడిన వర్గాలు. సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలైన కూలీలు, తెగలుకలిసి ఏర్పడిన సామాజిక వర్గమే వెనుకబడిన వర్గం. ఆర్టికల్ 15(4)- సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం గురించి చెప్పింది.
ఆర్టికల్ 16(4)- వెనుకబాటు వర్గం గురించి చెప్పి సేవా రంగాలలో వారికి సరైన ప్రాతినిధ్యం లేదని చెప్పింది. ఆర్టికల్ 45- ఉచిత నిర్బంధ విద్య గురించి చెప్పింది. ఆర్టికల్ 46- ఎస్సిలు, ఎస్టీలు అంతర్భాగంగా బలహీన వర్గాల అందరినీ కలుపుకొని వెనుకబడిన వర్గాలు అవుతారని చెప్పింది. ఆర్టికల్ 340 - ప్రతి రాష్ట్రం ఆ రాష్ట్రంలో నివసిస్తున్న వెనుకబడిన వర్గాల స్థితిగతులను పరిశీలించి వారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని చెప్పింది. పైన పేర్కొన్న అభిప్రాయాలు, ఆర్టికల్స్ పరిశీలిస్తే ఎస్సిలు, ఎస్టిలు, బిసి లు కలిపి వెనుకబడిన వర్గాలుగా చెప్పవచ్చు.కానీ ఎస్సి, ఎస్టిల విషయానికి వచ్చేసరికి రాజ్యాంగం వారికి రాజ్యాంగ రక్షణ కల్పించింది. కానీ అదే బిసిల విషయానికి వస్తే రాజ్యాంగ రక్షణ లేదు, నిర్దిష్టమైన నిర్వచనం లేదు.
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
టమోటా ధరల నియంత్రణకు ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరలకు విక్రయం
చిత్తూరు రైతు బజార్లో కందిపప్పును కేజీ రూ.165లకే ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు వెల్లడి
2024 జూలై మాస రాశి ఫలాలు
2024 జూలై మాస రాశి ఫలాలు
మలేరియాతో జర భద్రం.. ఈ జాగ్రత్తలతో అంతా పదిలం!
వైరల్ ఫీవర్ను తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
యోగా గురించి స్పెషల్గా పరిచయాలు అవసరం లేదు. యోగా గురించి అందరికీ తెలుసు.
ప్రపంచంలోనే మొదటి శాకాహార నగరం ఎక్కడుందో తెలుసా..!
భారతదేశం అనేక విశిష్ట ప్రదేశాలకు నిలయం. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలయం.
అమృతం కోసం సముద్రాన్ని చిలికిన కవ్వం మంధర పర్వతం.. హాలాహలం పాత్ర ఎక్కడుందంటే..
బీహార్లో అనేక మతపరమైన, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి భాగల్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఉన్న మంధర పర్వతం.
హనుమంతుడికి చిరంజీవి అనే వరం ఎవరు ఇచ్చారు..? అమరత్వం ఎలా పొందాడో తెలుసా..!
హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తీ అని అర్ధం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం.
పితృ, రాహు దోషాల నివారణకు ఈ రెమిడిస్ పాటించండి.. జీవితంలో సమస్యలు తొలగుతాయి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం ద్వారా జీవితంలో ఎటువంటి కష్టాలున్నా, దోషాలున్నా తొలగిపోతాయి.
పిల్లలతో నాన్న దోస్త్ అయిపోతున్నాడోచ్!
ఒకప్పుడు నాన్నంటే సింహస్వప్నం.చూపులతోనే బెదిరించే బాపతన్నమాట. ఆయన ఇంట్లో ఉన్నంత సేపూ అంతా సైలెన్స్!
రాత్రి సమయంలో నదీ స్నానం ఎందుకు చేయకూడదంటారు.?
ప్రస్తుతం ఈ పని ఈ సమయంలోనే అనే నియమం ఏమీ లేదు. నేటి జనరేషన్ ఏ పనినైనా ఎప్పుడైనా చేయగలరు.