భారతదేశంలో పండే కుంకుమపువ్వుకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. మానవునికి ఆయురారోగ్యాలు కలుగచేయిటలో, సుగంధ సుమధుర వాసనలు వెదజల్లుటలో, వైద్య పరంగా, ఆహార పరంగా, వస్త్రాల రంగుల్లో, ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి ఇలా అనేక రకాలుగా భారతీయ నాగరికతకు, సంస్కృతిలో మమేకమైనది. పురాతన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకూ భారతీయుల మనసను దోస్తూనే ఉంది.దీని చరిత్రను పరిశీలిస్తే, భారతదేశంలోకి మొదటిసారిగా పర్షియా ( ప్రస్తుతం ఇరాన్) నుంచి వచ్చినట్లు తెలుస్తోంది."బైజాంటియన్ " చక్రవర్తులు కాలంలో కుంకుమపువ్వు" కరెన్సీ" లా వాడేవారు అని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.బంగారం కంటే కుంకుమపువ్వుకు గిరాకీ, విలువ ఎక్కువ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. మందుల తయారీలో, మతపరమైన కార్యక్రమాల్లో కుంకుమపువ్వు వాడినట్లు వేదాలు ద్వారా తెలుస్తోంది.
క్రీ.శ 5వ శతాబ్దంలో ప్రముఖ బౌద్ధ సన్యాసి “ మధ్యానిథికా” కాశ్మీర్ సందర్శించిన సందర్భంగా కాశ్మీర్ లో కుంకుమపువ్వు పంట పండించడానికి సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయం నుంచే కుంకుమపువ్వు పంట దేశవ్యాప్తంగా చాలా చోట్ల పండించడం మొదలు పెట్టారు. ఆహారంలో, వస్త్రాలకు రంగులు అద్దటానికి కుంకుమపువ్వు విరివిగా వాడటం ప్రారంభించారు. చైనాలో కూడా మంగోలులు ద్వారా పర్షియా దేశం నుంచి ఈ కుంకుమపువ్వు పంట చేరినట్లు తెలుస్తోంది. అప్పటికే కాశ్మీర్ ప్రాంతాల్లో కుంకుమపువ్వు పంట పండుచున్నట్లు, గౌతమ బుద్ధుడు ప్రతిమలకు హారతి రూపంలో కుంకుమపువ్వు సమర్పిస్తునట్లు చైనా వైద్యుడు “వాన్ జెన్" తెలిపారు.
పర్షియా నుంచి వచ్చిన కుంకుమపువ్వు మరియు వివిధ సుగంధ ద్రవ్యాలు ఆ రోజుల్లోనే పెద్ద మార్కెట్ గా విస్తరించింది. అయితే, 11, 12 శతాబ్దాల నుంచి భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతాల్లో కుంకుమపువ్వు పంట విస్తారంగా పండించడం ప్రారంభించారు. ఇద్దరు సూఫీ సన్యాసులు ఖ్వాజా మసూద్ వాలీ, హజ్రత్ షేక్ షరీపుద్దీన్ కుంకుమపువ్వు విత్తనాలు ఇచ్చుట ద్వారా కాశ్మీర్ లో పంట విరివిగా పండించడం మొదలు పెట్టారు.
This story is from the July 07, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 07, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'35: చిన్న కథ కాదు'
ఈ మధ్య కొన్ని సినిమాలు స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాయి.
ఉరుకు పటేల
ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన 'ఉలవచారు బిర్యానీ'తో కథానాయకుడిగా పరిచయమైన యువకుడు తేజస్ కంచర్ల. 'హుషారు'తో విజయం అందుకున్నారు.
ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం
ముక్కు దిబ్బడకు జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు, అలర్జీలు వంటి అనేక కారణాలు వుంటాయి.
మొహం కడిగేటప్పుడు ఈ తప్పులు చేయకండి
సాధారణంగా ప్రతీ ఒక్కరు తన చర్మ సౌదర్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
గోధుమ పిండితో టేస్టీ బిస్కెట్లు..
ఇంట్లో తయారు చేసే బిస్కెట్లు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మైదాపిండితో తయారు చేసిన బిస్కెట్లు.. కానీ గోధుమ పిండితో కూడా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు.. చాలా హెల్దీ కూలగడా.. సాధారణంగా పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
క్షణికావేశాలు ఆత్మహత్యలు
ఈ ప్రపంచంలో అత్యున్నతమైనది మానవ జీవితం.జీవితంలో వచ్చు అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ జీవిత యాత్రను కొనసాగిస్తూ, తన జీవితాన్ని, కుటుంబాన్ని సురక్షితంగా, సంతృప్తికరంగా పూర్తి చేసే విధంగా మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలి.
సమయస్పూర్తి
బస్టాండ్ లో కూర్చుని ఉన్నారు శ్రీధర్, విశాల, బాబీ. తన చేతిలోని క్రికెట్ బాల్ కేసి సంతోషంగా చూస్తున్నాడు బాబీ. అది చూసి చిరాకుపడ్డాడు శ్రీధర్.
పుట్టింటి గౌరవం
లహరి చిన్న పిల్లేం కాదు. తనకు అంతా తెలుసు, తను ఏం చేస్తోందో? ఎందుకు చేయబోతోందో ? అన్ని ఆమెకు తెలుసు.
స్వాతంత్ర్యోద్యమంలో చవితి.. చారిత్రక ఉత్సవాలు
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి
తెలుగు వేటు పద్యాలు
తెలుగు వేటు పద్యాలు