అమరావతి-ఆంధ్రనాడు, ఆగస్టు 05: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ అంశం పునరావృతం కాకుండా ఉండేందుకై పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని సవరించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అద్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1982 ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును అనుసరించి గుజరాత్ రాష్ట్రంలో కఠినమైన నియమ నిబంధనలు, జరిమానాలను రూపొందించడం జరిగిందన్నారు. పేద వాడికి ఎటు వంటి అన్యాయం జరుగకుండా ఉండేందుకై వాటి కంటే మరింత కఠినమైన నియమ నిబంధనలు, జరిమానాలతో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును ను సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల ఎస్సైన్డు భూములను ఫ్రీ హెూల్డుగా మార్చడమే కాకుండా దాదాపు 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగిందన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు అంతా ప్రత్యేక దృష్టి సారించి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రుల వద్దకు వచ్చే విజ్ఞప్తుల్లో 80 శాతం పైగా రెవిన్యూకు సంబందించినవే అన్నారు.
Bu hikaye Andhranadu dergisinin Aug 06, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Andhranadu dergisinin Aug 06, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి
విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి అని తద్వారా శారీరక మానసిక దృఢత్వం తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
నరేష్ ఆచారి అంగప్రదక్షణ
సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలుపొందితే పొర్లు దండాలు పెడతానని ఆ దేవదేవుడికి కుప్పం టిడిపి పార్టీ అడ్వైజర్ నరేష్ ఆచారి మొక్కుకొని.. ఆ మొక్కను తీర్చుకున్నారు.
మిగిలిపోయిన వారికి 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ
గురువారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ ఛాంబర్ నందు అన్ని మండలాల ఎంపిడిఓ మునిసిపల్ కమిషన లు సచివాలయాల సిబ్బందితో వర్చువల్ విధానంలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి
సత్యవేడు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్ట్, అనస్థీషియా వైద్య నిపుణులు, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యుడు కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరారు.
ఏఐ సిటీగా అమరావతి
90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశం
సాకం నాగరాజకు వేమన సాహితీ పురస్కారం
గురువారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు
మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు
దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
తెలుగు వ్యవహార భాష ఆద్యులు గిడుగు వెంకట రామమూర్తి
తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల ఫించన్ లను ఈ నెల 31 (శనివారం) నే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేగవంతంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి
- స్మార్ట్ సిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్