ప్రజా సమస్యలే పరిష్కారం మా ధ్యేయం.. అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు పదే పదే.. నిత్యం ఊదరగొట్టే పెద్ద వాగ్దానం. కానీ, అది నీళ్లమూటగానే మిగిలిపోతోంది. ప్రతి సోమవారం స్పందన పేరుతో ప్రజా వినతులు స్వీకరణ.వాటికి తక్షణ పరిష్కారమంటూ హామీల గొప్పలు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకు మన ప్రభుత్వం అంటూ నిత్యం పర్యటన. సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేస్తామని వాగ్దానాల వెల్లువ. పల్లెపల్లెకు తిరుగుతారు. వీధి వీధికి వెళతారు. గడప గడపను తొక్కుతారు. కానీ, ఎక్కడ సమస్యలు అక్కడే గప్్చఫ తయారైంది. ఎక్కడో కాదు.. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గ సమీపంలోని పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలంలోని ఓ చిన్న గ్రామం. ఆ గ్రామం పేరే దాసర్లపల్లి.. అయితేనేం.. ఆ గ్రామం పుట్టెడు కష్టాల్లో మునిగి తేలుతోంది.
పట్టించుకొనే నాధుడు కరువయ్యారు. స్థానిక సర్పంచు నుంచి రాష్ట్ర మంత్రి వరకు, పంచాయతీ కార్యదర్శి నుంచి ఎంపీడీఓ, ఎమ్మార్వో, ఎంపీపీలు ఎందరున్నా వారికి దాసర్లపల్లి గోడు పట్టదు. ఎందుకో ఆ గ్రామంపై అందరికీ శీతకన్నే.. ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ గ్రామాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య కనీస వసతులు.. ఎవరు స్పందిస్తారో.. ఎవరు ఆ గ్రామాన్ని బాగు చేస్తారో అని ఆ ఊరి ప్రజలు ఎదురు చూసి చూసి కళ్లు చమ్మగిల్లుతోంది. కన్నీటి పర్యంతమవుతోంది. కనీసం జిల్లా అధికార యంత్రాంగమైనా స్పందించాలని ఆ పల్లె ప్రజానీకం వేడుకుంటోంది.
* ఏళ్లకు ఏళ్లు గడిచిపోయింది..
* కనీస వసతులు మృగ్యం ఎన్టీఆర్ హయాంలోని చిన్నపాటి తాగునీటి ట్యాంకులే గతి..
This story is from the Sep 4, 2023 edition of Andhranadu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Sep 4, 2023 edition of Andhranadu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి
విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి అని తద్వారా శారీరక మానసిక దృఢత్వం తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
నరేష్ ఆచారి అంగప్రదక్షణ
సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలుపొందితే పొర్లు దండాలు పెడతానని ఆ దేవదేవుడికి కుప్పం టిడిపి పార్టీ అడ్వైజర్ నరేష్ ఆచారి మొక్కుకొని.. ఆ మొక్కను తీర్చుకున్నారు.
మిగిలిపోయిన వారికి 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ
గురువారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ ఛాంబర్ నందు అన్ని మండలాల ఎంపిడిఓ మునిసిపల్ కమిషన లు సచివాలయాల సిబ్బందితో వర్చువల్ విధానంలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి
సత్యవేడు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్ట్, అనస్థీషియా వైద్య నిపుణులు, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యుడు కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరారు.
ఏఐ సిటీగా అమరావతి
90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశం
సాకం నాగరాజకు వేమన సాహితీ పురస్కారం
గురువారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు
మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు
దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
తెలుగు వ్యవహార భాష ఆద్యులు గిడుగు వెంకట రామమూర్తి
తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల ఫించన్ లను ఈ నెల 31 (శనివారం) నే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేగవంతంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి
- స్మార్ట్ సిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్