దక్షిణ భారతదేశంలో శ్రీ నృసింహ ఆరాధన ఎక్కువ. అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం. తమిళనాడు, కర్ణాటక, కేరళలో చాలా విశేష నృసింహ ఆలయాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా అనేక పురాతన శ్రీలక్ష్మీ నారసింహ ఆలయాలు నెలకొని ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో స్వామి నడయాడిన క్షేత్రాలుగా పేర్కొనే నవ నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. అవి అహోబిలం, సింహాచలం, వేదాద్రి, మంగళగిరి, అంతర్వేది, మాలకొండ(మాల్యాద్రి), పెంచలకోన, యాదాద్రి, ధర్మపురి.
శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ స్వామి కొలువైన సింహాచలం, స్వామి లోకకంఠకుడైన హిరణ్యకశ్యపుని సంహరించిన ప్రదేశంగా ప్రఖ్యాతి గాంచిన అహోబిలం వీటిలో మొదటి వరసలో ఉంటుంది. ప్రతి ఒక్క క్షేత్రం తమవైన పురాణ గాథలు కలిగి వుండటం విశేషం. నారసింహ అవతారంలో స్వామి చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకొన్న స్థలంగా నెల్లూరు జిల్లాలోని పెంచలకోన (పెనుశిల) ప్రఖ్యాతి గాంచింది.
క్షేత్ర గాథ
చుట్టూ పర్వతాలు, వాటి నుంచి జాలువారే జలపాతాలు..నగర జీవితానికి భిన్నంగా వుండే ప్రశాంత వాతావరణం ఈ ఆలయ ప్రత్యేకత. కొండల మీద ప్రవహించే కండలేరు ఆలయ వెనుక భాగాన పెద్ద జలపాతంగా మారి నేలకు జాలువారుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా సుందరంగా ఉంటుందా దృశ్యం. గతంలో ఈ ప్రదేశం ఋషివాటిక. శ్రీ కణ్వమహర్షి తపస్సు చేసిన ప్రదేశమిది. ఈయన ప్రస్తావన అనే పురాణాలలో కనిపిస్తుంది... ముఖ్యంగా మహాభారతంలో. మేనకా, విశ్వామిత్రుల పుత్రిక అయిన శకుంతలను పెంచిన తండ్రి కణ్వమహర్షి. శకుంతల కుమారుడైన భరతుని వల్లనే కదా మన దేశానికి భరతభూమి అన్న పేరు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కణ్వమహర్షి శ్రీ నారసింహుని గురించి తపస్సు చేసి స్వామివారి దర్శనాన్ని పొందిన స్థలం ఇదేనని అంటారు.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin September 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin September 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
కోటలకు కోట కొండవీటి కోట
ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.
చమత్కార శ్లోకాలు
మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.
సాధన చేస్తే గణితం సులభమే!
కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.
బాలగేయం
విజయం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
మట్టి విగ్రహం
రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.
సూర్యాస్తమయం లేని దేశాలు
ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాన్ని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు.
బ్రతుకు పుస్తకంలో అనుభవ భావాలు
ఆయుధం ఏం చేస్తుంది? ధరించిన వాడిని రక్షిస్తుంది. ఎదుటివాడిని శిక్షిస్తుంది. జీవనాధారానికి, స్వరక్షణకు వాక్కయినా, అస్త్రశస్త్రాలయినా ఆయుధాలే!
అలరిస్తున్న పద్యేంద్ర ధనస్సు
పుస్తక సమీక్ష
అద్భుతకళా 'రంగ్ మహల్'
పుస్తక సమీక్ష